ఆటోను ఢీకొట్టిన లారీ.. 12 మంది మృతి

ఆటోను ఢీకొట్టిన లారీ.. 12 మంది మృతి
  • ఉత్తరప్రదేశ్​లో ఘోర ప్రమాదం

షాజహాన్​పూర్ :  ఉత్తరప్రదేశ్​లోని షాజహాన్ పూర్​లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ సైడ్ నుంచి వెళ్తున్న లారీ ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ముగ్గురు మహిళలున్నారు. దట్టంగా పొగమంచు ఉండటంతో పాటు, ట్రక్కు రాంగ్ రూట్​లో రావడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆటోలోని ప్రయాణికులంతా గంగానది స్నానాలకు ఫరూఖాబాద్​లోని ఘటియా ఘాట్​కు వెళ్తున్నట్లు తెలిపారు.

ప్రమాదం తర్వాత ట్రక్కును కొంతదూరంలో వదిలేసి డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. అతడికోసం గాలిస్తున్నామన్నారు. ట్రక్కు రాంగ్ రూట్​లో వచ్చి ఢీకొట్టడంతో ఆటోలోని మొత్తం మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఢీకొన్న ధాటికి లారీ కింద ఆటో ఇరుక్కుపోయిందని చెప్పారు. ఆటోను విడిపించేందుకు లారీ డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు వెనక్కు మూవ్ చేశాడని, దీంతో ఆటోలో ఇరుక్కున్నవాళ్లు నుజ్జునుజ్జయ్యారని తెలిపారు. పోలీసులు స్పాట్​ నుంచి డెడ్​బాడీలను పోస్ట్ మార్టానికి తరలించారు. యూపీ సీఎం యోగి సంతాపం తెలిపారు.