హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో 12 ఆర్వో ప్లాంట్లు..

హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో 12 ఆర్వో ప్లాంట్లు..

మెహిదీపట్నం, వెలుగు: నీలోఫర్ దవాఖానలో దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ ద్వారా రూ.31 లక్షల 60 వేల వ్యయంతో  12 ఆర్ వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటిని శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయ్​కుమార్​ ప్రారంభించారు. కార్యక్రమంలో నీలోఫర్ ఆస్పత్రి సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ సీహెచ్.నాగజ్యోతి, దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ అధిపతి జి.నాగేశ్, డాక్టర్ ఆర్.వినోద్ కుమార్, ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శ్రీకాంత్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్ఎంవో డాక్టర్ రమ్య పాల్గొన్నారు.