- మహారాష్ట్ర స్కూలులో బాలిక మృతి
స్కూల్కు 10 నిమిషాలు లేట్ వచ్చినందుకు పనిష్మెంట్ కింద టీచర్ 100 గుంజీలు తీయించడంతో 12 ఏండ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయిలో చిల్డ్రన్స్ డే రోజే జరిగింది.
వసాయి(మహారాష్ట్ర): స్కూల్కు 10 నిమిషాలు లేట్ వచ్చినందుకు పనిష్మెంట్ కింద 100 గుంజీలు తీయాలని టీచర్ బలవంతం చేసింది. దీంతో 12 ఏండ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయిలో చోటుచేసుకుంది.
వసాయిలోని శ్రీ హనుమంత్ విద్యామందిర్ హైస్కూల్లో కాజల్ గోండ్ 6వ తరగతి చదువుతోంది. శుక్రవారం చిల్డ్రన్స్ డే సందర్భంగా స్కూల్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. కాజల్ స్కూల్కు 10 నిమిషాలు లేట్గా వచ్చింది. దీంతో టీచర్ ఆమెకు పనిష్మెంట్ ఇచ్చింది. బ్యాగు వేసుకుని 100 గుంజీలు తీయాలని బలవంతం చేసింది. గుంజీలు తీసిన తర్వాత ఇంటికి చేరుకున్న కాజల్ అస్వస్థతకు గురైంది.
దీంతో కాజల్ను ఆమె పేరెంట్స్ జేజే హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. గుంజీలు తీయించడం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ మృతురాలి బంధువులు స్కూల్ ముందు ధర్నాకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
