
- నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులు 12,634, విలువ రూ.90.71 కోట్లు
- కామారెడ్డిలో అప్లైచేసుకున్న వారిలో 90 శాతం వరకు సెలక్ట్
- తర్వాత విడతల వారీగా రూ.లక్ష దాటిన రుణాలు
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రకటించిన రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల మొదటి లిస్టు ఫైనలైంది. రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు రుణాలకు దరఖాస్తులు పెట్టుకున్న వారిలో అర్హులకు జూన్ 2 నుంచి 9 వరకు ప్రొసీడింగ్ లెటర్లు అందించే ఏర్పాట్లు ఆఫీసర్లు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ/ఈడ్లబ్యూఎస్, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలు కలిపి జిల్లాకు యూనిట్లు కేటాయించగా, నిజామాబాద్లో 12,634 మందికి ఫస్ట్ ఫేజ్లో రూ.90.71 కోట్ల లబ్ధి చేకూరబోతుంది. మిగతా దరఖాస్తులు రూ.లక్ష విలువకు మించినవి కావడంతో విడతల వారీగా శాంక్షన్ ఇవ్వనున్నారు.
రూ.50 వేలు, లక్షకు దరఖాస్తులు తక్కువే..!
యువవికాసం కింద ఇందూర్ జిల్లాలో రూ.367 కోట్ల విలువ గల 22,102 యూనిట్లను ఆయా సామాజిక వర్గాల నిరుద్యోగ యూత్కు సర్కార్ మంజూరు చేసి అప్లికేషన్లు ఆహ్వానించింది. రూ.50 వేల విలువ స్కీమ్కు వంద శాతం సబ్సిడీ ఉండగా, 7,125 యూనిట్ల అలాట్మెంట్ ఉంది. అయితే, దరఖాస్తులు తక్కువ సంఖ్యలో 2,053 మాత్రమే వచ్చాయి. అప్లికేషన్లు పెట్టుకున్న దాదాపు అందరికీ మంజూరు చేశాక కూడా ఈ కోటా ఇంకా మిగులనుంది. రూ.లక్ష విలువ యూనిట్లు 5,509 జిల్లాకు మంజూరు కాగా, 5,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లు పెట్టుకున్న 23 మంది మినహా మిగితా వారందరికీ శాంక్షనయ్యే పరిస్థితి ఉంది.
రూ.లక్ష స్కీమ్కు రూ.10 వేలు మాత్రమే బ్యాంక్లోన్ ఇవ్వగా, మిగతా రూ.90 వేలను గవర్నమెంట్ సబ్సిడీగా అందించనుంది. కామారెడ్డి జిల్లాలో రూ.50 వేల యూనిట్స్ లక్షం 4,373 ఉండగా, 1,118 అప్లికేషన్లు వచ్చాయి. రూ. లక్ష యూనిట్స్ లక్ష్యం 3,309 ఉండగా, 2,971 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో 90 శాతం వరకు సెలెక్ట్ కానున్నారు. సెలెక్ట్ అయిన యూత్ కిరాణా, పౌల్ట్రీ, మిల్క్ సెంటర్, ఎగ్ షాప్, ఫ్రూట్ షాప్, జిరాక్స్, వెల్డింగ్, పాన్ షాప్, సైకిల్ షాప్, గేదేలతో పాల వ్యాపారం చేసేలా జూన్10 నుంచి 15 వరకు ఈపీడీ ట్రైనింగ్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్కార్ సబ్సిడీ రిలీజ్ అయ్యాక జూన్ 21 నుంచి 30 యూనిట్లన్నీ గ్రౌండ్ చేసే ప్లాన్ రెడీ అయ్యింది.
తర్వాత మిగతా దరఖాస్తులు టేకప్
నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ యువవికాసం కింద అలాటైన 22,120 యూనిట్లకు మొత్తం 59,027 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 7,539 అప్లికేషన్లు జూన్ నెలలో పరిష్కారం కాబోతుండగా, మిగితా రూ.లక్షకు మించిన విలువ స్కీమ్ 51,488 అప్లికేషన్లను విడతల వారిగా టేకప్ చేయనున్నారు. జులై నెలలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల స్కీమ్, ఆగస్టులో రూ.3 లక్షలు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రూ.4 లక్షల స్కీమ్లకు శాంక్షన్ ఇచ్చే ప్రొగ్రామ్ ఫిక్స్చేశారు. బ్యాంక్ సిబిల్ స్కోర్ ప్రామాణికం చేసుకొని మంజూరు లభించనుంది.
గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నం
సర్కార్ మార్గదర్శక సూత్రాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేశాం. మొదటి విడతగా సెలెక్ట్ చేసిన వారికి జూన్లో ప్రోసిడింగ్ లెటర్లు అందిస్తం. స్వయం ఉపాధి రంగంలో యూత్ స్థిరపడేలా గవర్నమెంట్ అమలు చేస్తున్న స్కీమ్కు మంచి ఆదరణ కనిపిస్తున్నది.
రమేశ్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్