ఇండోనేసియాలో పేలుడు13 మంది మృతి

ఇండోనేసియాలో పేలుడు13 మంది మృతి

పాలు (ఇండోనేసియా): ఇండోనేసియాలోని నికెల్ తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది వర్కర్లు చనిపోయారు. 46 మంది వరకు గాయపడ్డారు. చైనాకు చెందిన ఈ ఫ్యాక్టరీ.. సులవేసి ద్వీపంలో ఉంది. మృతుల్లో నలుగురు చైనీయులు, 9మంది ఇండోనేసియా వర్కర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో నలుగురు చైనీయుల హెల్త్ కండీషన్ సీరియస్​గా ఉందన్నారు. 

పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో బిల్డింగ్ సైడ్ వాల్స్ కూడా దెబ్బతిన్నాయి. ఫైర్ డిపార్ట్​మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. కొలిమికి రిపేరు చేస్తున్న టైమ్​లో కింది నుంచి ఎక్స్​ప్లోజివ్ లిక్విడ్స్ బయటికొచ్చాయి. దీంతో ఒక్కసారిగా వాటికి మంటలు అంటుకున్నాయి. పక్కనే ఆక్సిజన్ సిలిండర్లు ఉండటంతో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కొలిమితో పాటు గోడలు బద్దలయ్యాయి. రిపేరు సమయంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇన్వెస్టిగేషన్  అధికారులు తెలిపారు.