
తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 31,095 మందికి టెస్టులు చేయగా.. 1302 మందికి పాజిటివ్ వచ్చింది.దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,72,608 కు చేరిం. మరో 9 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1042కు చేరింది. నిన్న ఒక్కరోజే 2,330 మంది డిశ్చార్జ్ కావడంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 1,41,930 కు చేరింది. ఇంకా 29,636 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ లో 266 కేసులు నమోదవ్వగా..కరీంనగర్ లో 102 నమోదయ్యాయి.
కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్..8 మంది మృతి