
తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. ఏపీలో నిన్నఒక్కరోజే(బుధవారం) 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఇవాళ (గురువారం) ఉదయం 10 గంటల వరకు మరో 21 కరోనా కేసులు నమోదయినట్లు ప్రభుత్వం బులెటిన్ రిలీజ్ చేసింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132 కు చేరింది. అత్యధికంగా గుంటూరు 20, నెల్లూరు జిల్లాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో 17, కడప 15, కృష్ణ 15 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1800 మంది శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 132 పాజిటివ్, 1175 నెగటివ్ వచ్చాయి. ఇంకా 493 మంది రిపోర్ట్ రావాల్సి ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.