
రేణుకాస్వామి మర్డర్ కేసులో హీరో ధనుష్ కు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఈ కేసులో శనివారం జరిగిన వాదనలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. హీరో దర్శన్ తోపాటు ప్రదోష్, వినయ్, ధనరాజ్ కూడా 14 రోజుల రిమాండ్ కు వెళ్లనున్నారు. ఇక ఈ కేసులో తదుపరి విచారణను జులై 4 వాయిదా వేసింది కోర్టు.
ఇదిలా ఉంటే.. రేణుకాస్వామి మర్డర్ కేసులో హీరో ధనుష్ జూన్ 11న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపడంతో హీరో దర్శన్ తన సహాయకులతో కలిసి అతణ్ని చిత్ర హింసలు పెట్టి హత్యే చేయించాడు. ఇక ఈ కేసులో పవిత్ర గౌడ ఎ-1, దర్శన్ ఎ-2 ముద్దాయిలుగా ఉన్నారు.