విశాఖలో 14 ఏళ్ల బాలికకు.. కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ ఎటాక్ అయ్యింది..!

విశాఖలో 14 ఏళ్ల బాలికకు.. కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ ఎటాక్ అయ్యింది..!

కరోనా.. కరోనా.. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. కరోనా వస్తే ఏమౌతుందిలే.. ఇప్పటికే రెండు సార్లు చూశాం అంటున్నారు. పరిస్థితి అంత ఈజీగా.. లైట్ తీసుకునే విధంగా ఏమీ లేదని.. దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి. 2025, జూన్ 5వ తేదీ నాటికి దేశంలో 5 వేల కేసులు నమోదు అయితే.. అందులో వెయ్యి 200 వందల కేసులు.. జూన్ 4వ తేదీ ఒక్క రోజే నమోదు అయ్యాయి. ఈ డేటా అంతా ఇలా ఉంటే.. ఏపీ రాష్ట్రం విశాఖపట్నంలో నమోదైన కరోనా కేసు కలకలం రేపుతోంది.

విశాఖపట్నంకు చెందిన 14 ఏళ్ల బాలికకు కరోనా ఎటాక్ అయ్యింది. ఇది కొత్త వైరస్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్థారించారు డాక్టర్లు. బాలికను కేజీహెచ్ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ కింద మూడు కేసులు వచ్చాయని కూడా కేజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శివానంద ప్రకటించారు.

విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ ఎటాక్ కావటం.. ఇప్పటికే మూడు కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. జలుబు, దగ్గు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు విశాఖపట్నం డాక్టర్లు. కరోనా అనుమానం ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని.. ఇంట్లో ఉండే ట్యాబ్లెట్లు తీసుకోవద్దని.. మెడికల్ షాపు వాళ్లు ఇచ్చే మందులతో తగ్గిపోతుందనే ఉద్దేశంతో అశ్రద్ధ వహించొద్దని హెచ్చరిస్తున్నారు వైజాగ్ డాక్టర్లు.