ప్రచారానికి 150 మంది బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రచారానికి 150 మంది బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీకి చెందిన ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శుక్రవారం నుంచి వివిధ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేపట్టనున్నారు. అందులో భాగంగా గురువారమే పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్​కు చేరుకున్నారు.

మహారాష్ట్ర, కర్నాటక, గోవాకు చెందిన 150 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో నియోజకవర్గాన్ని కేటాయించిన పార్టీ.. అందులో కొందరిని జిల్లాలకు ఇన్​చార్జులుగా నియమించింది.