ఫలోది: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోది జిల్లాలోని ఫలోది దగ్గరలో ఉండే మటోడా గ్రామం సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ను టెంపో ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ మథానియా వాసులుగా తెలిసింది. సహాయక చర్యల కోసం పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
జోధ్పూర్లోని సుర్సాగర్కు చెందిన ఈ యాత్రికులు బికనీర్లోని కొలాయత్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని ఫలోది భారత్ మాల హైవేపై ఈ ఘోరం జరిగింది. బికనీర్లోని కోలాయత్ నుంచి వస్తున్న టెంపో-ట్రావెలర్ రోడ్డుపై ఆగి ఉన్న ట్రయిలర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. అన్ని మృతదేహాలను ఒసియన్లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. గాయపడిన వారిని ఇప్పుడు జోధ్పూర్కు పంపారు. గాయపడిన వారిని చికిత్స కోసం జోధ్పూర్కు తరలించినట్లు జిల్లా కలెక్టర్ శ్వేతా చౌహాన్ తెలిపారు.
Phalodi, Rajasthan | An accident occurred on the Bharat Mala Highway. A tempo-traveller coming from Kolayat, Bikaner, rammed into a trailer parked on the road from behind. 15 people were killed and 2 were injured in the accident. All the bodies have been kept in the mortuary of… https://t.co/ShjzLYgcdG
— ANI (@ANI) November 2, 2025
