ఏడాదిన్నరకే నూరేళ్లు నిండినయ్... కారు కింద పడి ఏడాదిన్నర పాప మృతి

ఏడాదిన్నరకే నూరేళ్లు నిండినయ్... కారు కింద పడి ఏడాదిన్నర పాప మృతి
  • యూపీ నుంచి భిక్షాటనకు వచ్చిన కుటుంబంలో విషాదం

ఓల్డ్​సిటీ, వెలుగు : యూపీ నుంచి భిక్షాటనకు వచ్చిన ఓ కుటుంబం కారు ప్రమాదంలో ఏడాదిన్నర బిడ్డను పోగొట్టుకున్నది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్​మీర్​చౌక్​పోలీస్​స్టేషన్​పరిధిలో సోమవారం జరిగింది. రంజాన్ మాసంలో భిక్షాటన కోసం యూపీ నుంచి నిషా కుమారి అనే మహిళ తన పిల్లలతో వచ్చింది. 

తన ఏడాదిన్నర కొడుకుతో కలిసి ఎంజీబీఎస్ బస్ డిపో ప్రాంతంలో భిక్షాటన చేస్తూ అక్కడే ఉన్న ఫుట్​పాత్​పై ఉంటోంది. సోమవారం అరుణ్ ఫుట్​పాత్​పక్కన ఆడుకుంటూ ఉండగా రోడ్డుపై వెళ్తున్న కారు కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. మీర్ చౌక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.