హైదరాబాద్లో లక్షా 80 వేల విగ్రహాలు నిమజ్జనం.. ఇంకా నిమజ్జనం కావాల్సినవి 25 వేలు: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్లో లక్షా 80 వేల విగ్రహాలు నిమజ్జనం.. ఇంకా నిమజ్జనం కావాల్సినవి 25 వేలు: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ జరుగుతున్న వినాయక నిమజ్జనాలను ఆదివారం (సెప్టెంబర్ 07) పరిశీలించారు సీపీ ఆనంద్. హైదరాబాద్ లో ఇప్పటి వరకు లక్షా 80 వేల విగ్రహాలు నిమజ్జనం అయినట్లు తెలిపారు. ఇంకా 25 వేలు నిమజ్జనం కావాల్సి ఉందని చెప్పారు. నిమజ్జనాలు ప్రశాతంగా జరిగాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

గణేష్ నిమజ్జన శోభాయాత్ర శనివారం ఉదయం 6.30 కి ప్రారంభమైందని.. పెద్దవిగ్రహాలు ఇంకా 900నిమజ్జనం అవ్వాల్సి ఉందని.. చిన్న విగ్రహాలు కలుపుకొని ఈరోజు 25 వేల విగ్రహాలు నిమజ్జనం అవ్వాల్సి ఉందని తెలిపారు. 40 గంటల పాటు నిమజ్జన శోభాయాత్ర జరిగిందని సీపీ చెప్పారు. 

ఆన్ లైన్ లో 12 వేల 34 విగ్రహాలు  రిజిస్టర్ చేసుకున్నారని.. వాటిలో 6 వేల 300 విగ్రహాలు శనివారం వరకు నిమజ్జనం అయ్యాయని చెప్పారు. ఇవి కాకుండా లక్ష 20 వేల విగ్రహాలు హైదరాబాద్ లో బేబీ పాండ్స్, ఇతర చెరువుల్లో నిమజ్జనం అయ్యాయని తెలిపారు. హైద్రాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం లక్షా 80 వేల విగ్రహాలు నిమజ్జనం అయినట్లు జీహెచ్ఎంసీ చెబుతోంది. 

పోలీసులు రెండు రోజులు నిద్ర లేకుండా 40 గంటల బందోబస్తు చేశారని.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల  సమన్వయంతో అనుకున్న టైమ్ కంటే ముందే నిమజ్జనం పూర్తి చేశామని తెలిపారు.  పదిరోజులుగా గణేష్ మండపం నిర్వాహకులను ఒప్పించి ఈసారి ముందుగానే వినాయకులను తీయించామని అన్నారు. అందులో భాగంగా ముందు సౌత్ జోన్ విగ్రహాలు తీయించినట్లు చెప్పారు. అక్కడ సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నందున ముందుగా నిమజ్జనం జరిపించినట్లు చెప్పారు. 

ఆ తర్వాత మిగతా ప్రాంతాల విగ్రహాలను తీయించి నిమజ్జనం చేయించామని తెలిపారు. ఈసారి విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉందని.. 40 ఫీట్ల కన్నా ఎత్తు ఉన్న విగ్రహాలు ఈసారి పెరిగాయని తెలిపారు. దీంతో శోభాయాత్ర ఆలస్యం అయినట్లు తెలిపారు. శనివారం రాత్రి శోభాయాత్రలో చిన్న చిన్న గొడవలు జరిగగా.. 5 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసినందుకు  పోలీసులకు అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఒక ప్రణాళిక బద్దంగా నిమజ్జన శోభాయాత్ర జరిగిందని ఈ సందర్భంగా సీపీ ఆనందర్ చెప్పారు.