జాతీయ లోక్ అదాలత్లో 1840 కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్లో 1840 కేసులు పరిష్కారం

కామారెడ్డి, వెలుగు :  జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్​అదాలత్​లో  1,840 కేసులు పరిష్కరించారు. జడ్జి సీహెచ్​వీఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ లోక్​ అదాలత్​లో చీటింగ్​కేసులు,  సైబర్​ కేసులు,  చెక్​బౌన్స్, భార్యభర్తల​ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.  రాజీ మార్గమే రాజమార్గమన్నారు.   క్రిమిల్​ కేసులు  1751, సివిల్​ కేసులు 2,  మోటార్​ వెహికల్ యాక్ట్​ కేసులు 15, సైబర్​ క్రైమ్​ కేసులు 37, బ్యాంక్​ లిటిగేషన్​ కేసులు 35 పరిష్కారం అయ్యాయి. 

 జిల్లా లీగల్​ సెల్​ ఆథారిటీ సెక్రటరీ టి.నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి,  బార్​ అపోసియేషన్​ ప్రెసిడెంట్ నందరమేశ్,   పీపీలు రాజ్​గోపాల్​గౌడ్,  దామోదర్​రెడ్డి, సూర్యప్రకాశ్,  అడ్వకేట్లు శంకర్​రెడ్డి, దేవరాజుగౌడ్​, శ్రీధర్,  శ్యాంగోపాల్​రావు తదితరులు పాల్గొన్నారు.  

యాక్సిడెంట్ కేసులో రూ. కోటి 4‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లక్షల పరిహారం 

కామారెడ్డి కోర్టులో జరిగిన జాతీయ లోక్​అదాలత్​లో  యాక్సిడెంట్​ కేసు పరిష్కారమైంది. ఉద్యోగి తాల్లపల్లి శ్రీనివాస్​గౌడ్ తాడ్వాయి సమీపంలో  యాసిడెంట్​లో చనిపోయారు.   ఇన్సురెన్స్​ కంపెనీపై రూ. 2 కోట్ల పరిహారం కోరుతూ కేసు వేశారు. లోక్​అదాలత్​లో ఇరువర్గాలు సామరస్య పూర్వకంగా రూ కోటి 40 లక్షలకు అంగీకరించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.