
కామారెడ్డి, వెలుగు : జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 1,840 కేసులు పరిష్కరించారు. జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో చీటింగ్కేసులు, సైబర్ కేసులు, చెక్బౌన్స్, భార్యభర్తల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. క్రిమిల్ కేసులు 1751, సివిల్ కేసులు 2, మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు 15, సైబర్ క్రైమ్ కేసులు 37, బ్యాంక్ లిటిగేషన్ కేసులు 35 పరిష్కారం అయ్యాయి.
జిల్లా లీగల్ సెల్ ఆథారిటీ సెక్రటరీ టి.నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, బార్ అపోసియేషన్ ప్రెసిడెంట్ నందరమేశ్, పీపీలు రాజ్గోపాల్గౌడ్, దామోదర్రెడ్డి, సూర్యప్రకాశ్, అడ్వకేట్లు శంకర్రెడ్డి, దేవరాజుగౌడ్, శ్రీధర్, శ్యాంగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.
యాక్సిడెంట్ కేసులో రూ. కోటి 4లక్షల పరిహారం
కామారెడ్డి కోర్టులో జరిగిన జాతీయ లోక్అదాలత్లో యాక్సిడెంట్ కేసు పరిష్కారమైంది. ఉద్యోగి తాల్లపల్లి శ్రీనివాస్గౌడ్ తాడ్వాయి సమీపంలో యాసిడెంట్లో చనిపోయారు. ఇన్సురెన్స్ కంపెనీపై రూ. 2 కోట్ల పరిహారం కోరుతూ కేసు వేశారు. లోక్అదాలత్లో ఇరువర్గాలు సామరస్య పూర్వకంగా రూ కోటి 40 లక్షలకు అంగీకరించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.