
ఏపీలో ఒక్కరోజేఆరుగురికి కరోనా పాజిటివ్ గా తేలిం ది.దీంతో కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. శనివారం ప్రకాశం జిల్లాలో మూడు, విజయవాడ, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఒక్కోకేసు నమోదైంది. కర్నూలు జిల్లా సంజాములలో రాజస్థాన్ యువకుడికి, ప్రకాశం జిల్లా చీరాల నవాబు పేటలో దంపతులు, మరో వ్యక్తి కి కరోనా సోకినట్లు ఏపీ హెల్త్ డిపార్ట్ మెంట్బులెటిన్ లో పేర్కొంది. రాజస్థాన్ యువకుడిని కర్నూలులో, ప్రకాశం జిల్లా బాధితులకు ఒంగోలు రిమ్స్ లో ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రాజస్థాన్ కు చెందిన యువకుడు మార్బల్ పరిశ్రమలో పనిచేసేవాడని, 18మందితో కలిసి ఉండేవాడని కర్నూలు జిల్లాకలెక్టర్ చెప్పా రు. ఇటీవల సొంత రాష్ట్రా నికివెళ్లి వచ్చినట్లు తెలిపారు. బాధితుడితో ఉన్న వారందరినీ బనగానపల్లెలోని క్వారంటైన్సెంటర్ కు తరలించామన్నారు.