మహరాష్ట్రలోని నాగ్పూర్లో నిర్భయ తరహా ఘటన జరిగింది. 19 ఏళ్ల యువతిపై 52 ఏళ్ల వృద్ధుడు అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఎదురు తిరగడంతో నోట్లో గుడ్డలు కుక్కి.. ఇనుపరాడ్డుతో హింసించాడు ఆ దుర్మార్గుడు. ఈ ఘాతుకానికి పాల్పడి పారిపోయిన ఆ వృద్ధుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
నాగ్పూర్లోని ఓ స్పిన్నింగ్ మిల్లో లేబర్గా వర్క్ చేస్తోంది 19 ఏళ్ల యువతి. ఆమె తన సోదరుడు, మరో అమ్మాయితో కలిసి పార్ది ఏరియాలో అద్దె ఇంట్లో ఉంటోంది. జనవరి 21న వారిద్దరూ పని మీద ఊరికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న ఆమెపై తను పని చేస్తున్న స్పిన్నింగ్ మిల్ సూపర్వైజర్ యోగిలాల్ (52) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఎదురు తిరిగి తప్పించుకునే ప్రయత్నం చేయగా నోట్లో గుడ్డలు కుక్కాడు. బాధితురాలిపై శారీరకంగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఆ వృద్ధుడు ఇనుపరాడ్డుతో హింసించాడు. ఈ ఘటన తర్వాత యోగిలాల్ పారిపోయాడు. తన సోదరుడు ఊరి నుంచి తిరిగి వచ్చాక జనవరి 24న తనకు జరిగిన ఘోరం గురించి చెప్పి కంటతడి పెట్టుకుంది. దీంతో ఆ ఇద్దరు కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు గోండియా ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేశారు.