తెలంగాణలో మరో 1931 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1931 కరోనా కేసులు

రాష్ట్రంలో తాజాగా మరో 1931 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.  దాంతో మొత్తం కేసుల సంఖ్య 86,475 కు చేరింది. తాజాగా బుధవారం కరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 665 కు చేరింది. కొత్తగా 1780 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 64,854గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,736 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో 15,621 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.93 శాతంగా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇది భారత రికవరీ రేటు 70.37 శాతం కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో బుధవారం 23,303 మందికి కరోనా టెస్టులు చేశారు. వాటిలె 1931 మందికి పాజిటివ్ గా వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 6,89,150కు చేరింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 298, వరంగల్ అర్బన్ 144, రంగారెడ్డి 124, సంగారెడ్డి 86, సిద్ధిపేట 71, కరీంనగర్ 89, నల్గొండ 84, మేడ్చల్ 71, ఖమ్మం 73, పెద్దపల్లి 64, సూర్యాపేట 64, జనగామా 59, గద్వాల 56, నాగర్ కర్నూల్ 53, నిజామాబాద్ 53, రాజన్న సిరిసిల్ల 54, జగిత్యాల 52, భద్రాద్రి 39, కామారెడ్డి 39, మంచిర్యాల 45, మహబూబ్ నగర్ 43, మహబూబాబాద్ 34 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

అనాథలకు నీడ లేదు!

ఆర్టీపీసీఆర్ టెస్టులకు క్యూ కడుతున్న జనాలు

టెన్షన్లకి చెక్ పెట్టండిలా..