- 30న ముగియనున్న ప్రస్తుత పీసీసీఎఫ్ సువర్ణ పదవీ కాలం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్-హెచ్ఓఎఫ్ఎఫ్)గా వినయ్కుమార్ నియామకం అయ్యారు. 1992 బ్యాచ్కు చెందిన ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం పీసీసీఎఫ్ గా కొనసాగుతున్న సువర్ణ పదవీకాలం ఈ నెల 30 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వినయ్ కుమార్ ను నియమించగా.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ హోదాలో కొనసాగనున్నారు. ఈయన గతంలో అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల్లో వివిధ హోదాల్లో పని చేశారు.
ఆదిలాబాద్ డీపీఏపీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేయడంతో పాటు ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్గా పనిచేసిన ఈయన... వరల్డ్ బ్యాంక్, జైకా సహకారంతో అమలైన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ అటవీ సంరక్షణకు చర్యలు చేపడుతానని, నిబద్ధతతో బాధ్యతలను నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.
