ఏపీలో కొత్త‌గా 1,933 కరోనా కేసులు.. 19 మంది మృతి

ఏపీలో కొత్త‌గా 1,933 కరోనా కేసులు.. 19 మంది మృతి

ఏపీలో కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలకు చేరువలోకి వచ్చింది. గత 24 గంటల్లో 17,624 మందికి పరీక్షలు నిర్వహించగా… 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో18 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో ఒకరికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 29,168కి చేరింది.