ముంబై కొవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి

ముంబై కొవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి

ముంబైలోని ఓ కొవిడ్ సెంటర్‌‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు. వీరిని బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణం ఇంకా తెలియరాలేదని ముంబై మేయర్ కిషోర్ పడ్నేకర్ తెలిపారు. ఈ ఆస్పత్రిలో సాధారణ పేషెంట్లతోపాటు కరోనాకు చికిత్స పొందుతున్న కూడా ఉన్నారని చెప్పారు. ఆస్పత్రిలో మొత్తం 76 మంది పేషెంట్స్ ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారని, వారిలో 73 మంది కరోనా రోగులేనన్నారు. వీరందర్నీ వేరే ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.