2 ఆర్టీసీ బస్సులు, గ్యాస్‌ లారీ ఢీ.. ఐదుగురు మృతి

2 ఆర్టీసీ బస్సులు, గ్యాస్‌ లారీ ఢీ.. ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సుంకరి పేట దగ్గర ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. రెండు బస్సుల్లో చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ ని తగలబెట్టడంతో విపరీతంగా పొగ కమ్ముకోవడంతో.. రెండు బస్సులు ఢీకొట్టాయని స్థానికులు చెబుతున్నారు. రెండు బస్సుల్లోనూ ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. సంఘటన స్థలానికి అంబులెన్సులు, పోలీసులు, ఆర్.టి.సి అధికారులు చేరుకున్నారు. గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటళ్లకు చేర్చారు.