పూర్తిస్థాయి డీజీపీగా రవి గుప్తా .. 20 మంది ఐపీఎస్​లకు బదిలీలు, పోస్టింగ్స్​

పూర్తిస్థాయి డీజీపీగా రవి గుప్తా .. 20 మంది ఐపీఎస్​లకు బదిలీలు, పోస్టింగ్స్​

హైదరాబాద్, వెలుగు:  ప్రస్తుతం ఇన్​చార్జ్​ డీజీపీగా ఉన్న రవి గుప్తాను పూర్తి స్థాయి డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనతోపాటు మొత్తం 20  మంది ఐపీఎస్​అధికారుల ట్రాన్స్​ఫర్స్​, పోస్టింగ్స్​పై మంగళవారం సీఎస్​ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి వరకు డీజీపీగా ఉండి.. ఈసీ ఆదేశాలతో సస్పెన్షన్​కు గురై, ఆ తర్వాత సస్పెన్షన్​ ఎత్తివేతతో పోస్టింగ్​ కోసం ఎదురుచూస్తున్న అంజనీ కుమార్​ను రోడ్డు భద్రతా విభాగం చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. 

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా రాజీవ్‌ రతన్‌, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో లూప్​లైన్​లో ఉన్న కీలక ఐపీఎస్​ ఆఫీసర్లకు ప్రస్తుత ప్రభుత్వం ఫోకల్​ పోస్టింగ్​లు కేటాయించింది. ఆర్బీవీఆర్ఆర్​ అకాడమీ అదనపు డీజీగా ఉన్న ఏ.ఆర్.శ్రీనివాస్ ను  ఏసీబీ డైరెక్టర్​గా నియమించింది.  ఈయన ఇటీవల బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఏసీబీ డైరెక్టర్​ పోస్టు నుంచే అకాడమీకి బదిలీ అయ్యారు. 

ఇప్పుడు కాంగ్రెస్​ సర్కార్​ మళ్లీ తిరిగి ఏసీబీలోకి తీసుకున్నది. ఇదిలా ఉంటే..  స్టీపెన్​ రవీంద్రను హోంగార్డ్స్​ ఐజీగా, మహేష్ భగవత్​ కు  రైల్వేస్, రోడ్డు సేఫ్టీ అదనపు డీజీగా ప్రభుత్వం నియమించింది. సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. శిఖా గోయల్ కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.