- 11 గంటలకు రిలీజ్ చేయనున్న విద్యాశాఖ సెక్రటరీ వెంకటేశం
హైదరాబాద్, వెలుగు : ఇంటర్మీడియెట్పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం11గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్ సైట్లను చూడాలని అధికారులు ప్రకటించారు.
ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ను ఒకేసారి విడుదల చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి19 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు 9.80 లక్షల మంది అటెండ్ అయ్యారు.