- నిందితులు పుణే వాసులు
జీడిమెట్ల, వెలుగు: ఒడిశా నుంచి పుణేకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని కూకట్పల్లి పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పుణేకు చెందిన సచిన్, లౌకిక్గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో బుధవారం రాత్రి నిఘా ఉంచి కూకట్ పల్లిలో ఇద్దరినీ పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల విలువైన 21కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఒడిశా, బరంపూర్ నుంచి పుణేకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
