ఫుడ్ పాయిజన్ తో 22 మందికి అస్వస్థత

ఫుడ్ పాయిజన్ తో 22 మందికి అస్వస్థత

ఉట్నూరు,వెలుగు: ఫుడ్ పాయిజన్ తో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్
జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాం నాయక్ తండాలో ఓ కుటుంబం మంగళవారం దసరా దేవి పూజలు నిర్వహించారు. నైవేద్యం, తినుబండారాలు బుధవారం కుటుంబ సభ్యులు సహా 2 2 మంది తిన్నారు. మధ్యాహ్న సమయంలో అందరికీ వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో వారిని ఉట్నూరు హాస్పిటల్ తరలించారు. ఆర్డీవో వినోద్ కుమార్ , తహసీల్దార్ చంద్రశేఖర్ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు