- జీడిమెట్ల, సికింద్రాబాద్లలో ముగ్గురు అరెస్ట్
జీడిమెట్ల/పద్మారావునగర్, వెలుగు: కుత్బుల్లాపూర్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కుత్బుల్లాపూర్ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన సురేశ్లక్ష్మణ్, సురేఖఅంకుశ్ లుగా గుర్తించారు. వీరు కుత్బుల్లాపూర్కృష్ణకుంజ్గార్డెన్సమీపంలోని ఓ ఇంట్లో ఉంటూ.. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు తేల్చారు. పక్కా సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి, తరలించేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్చేసి, రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఒడిశాకు చెందిన వ్యక్తి..
నగరానికి గంజాయి తీసుకొచ్చిన ఒడిశాకు చెందిన గగన్ దాస్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు ఎస్టీఎఫ్సీ అధికారులు తెలిపారు. ఇతను మంగళవారం 8.3 కిలోల ఎండు గంజాయి ఉన్న బ్యాగుతో సికింద్రాబాద్రైల్వేస్టేషన్లో దిగాడన్నారు. ప్లాట్ఫామ్నంబర్10 వద్ద మరో వ్యక్తికి సరుకును అప్పగించేందుకు వేచిచూస్తుండగా.. ఎస్టీఎఫ్సీ బృందం అదుపులోకి తీసుకుందని పేర్కొన్నారు.
బ్యాగును తనిఖీ చేయగా గంజాయి లభ్యమైందన్నారు. నిందితుడిని, గంజాయిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్సై మంజు తెలిపారు. ఈ గంజాయిని నగరంలో ఎవరికి అప్పగించాలనుకున్నాడనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
