
ఇల్ నాయీస్: అమెరికాలోని ఓ అబార్షన్ డాక్టర్ ఇంట్లో రెండు వేలకు పైగా మెడికల్ పరంగా భద్రపరిచిన పిండాలను గుర్తించడం కలకలం రేపింది. ఆ డాక్టర్ వారం క్రితం చనిపోగా.. ఇప్పుడు వీటిని గుర్తించారు. ఈ విషయాన్ని విల్ కౌంటీ షెరిఫ్ ఆఫీస్ ధ్రువీకరించింది. ఆ డాక్టర్ ఇంట్లో 2,246 పిండాలను గుర్తించినట్టు వెల్లడించింది. డాక్టర్ ఉల్రిచ్ క్లోప్ఫెర్ ఈ నెల 3న చనిపోయాడు. ఇండియానాలోని సౌత్బెండ్లో ఒక అబార్షన్ క్లీనిక్లో ఆయన సుదీర్ఘ కాలంగా డాక్టర్గా పనిచేశాడు. పేషెంట్ల రిజిస్టర్ను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం.. మెడికల్ అబార్షన్ పాలసీలను ఉల్లఘించడం వంటి వాటికి సంబంధించి ఈ క్లీనిక్పై ఇండియానా స్టేట్ డిపార్ట్మెంట్ఆఫ్ హెల్త్కు అనేక కంప్లయింట్లు అందాయి.
అబార్షన్కు ముందు 18 గంటల పాటు పేషెంట్లకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ను ఇవ్వడం లేదని మెడికల్ ఏజెన్సీలు గుర్తించాయి. దీంతో 2015లో ఈ హాస్పిటల్ లైసెన్స్ను అధికారులు రద్దు చేశారు. ఇండియానాలో అతి ఎక్కువ అబార్షన్లు చేసిన డాక్టర్గా క్లోప్ ఫెర్ కు పేరుంది. నాలుగు దశాబ్దాలుగా చాలా క్లీనిక్స్లో అతడు వేలాది ఆపరేషన్లు చేశాడు. అబార్షన్ల సమయంలో పేషెంట్లకు సేవలందించేందుకు క్వాలిఫైడ్ స్టాఫ్ లేకపోవడం ఇంకా పలు కారణాలను గుర్తించి ఇండియానా మెడికల్ లైసెన్సింగ్ బోర్డ్ ప్యానెల్2016 నవంబర్లో కోప్ఫెర్ లైసెన్సును రద్దు చేసింది.
43 ఏండ్ల తన కెరీర్లో అబార్షన్లు చేసే సమయంలో తాను ఒక్క పేషెంట్ను కూడా కోల్పోలేదని ప్యానెల్కు అతడు చెప్పాడు. త్వరలోనే తన క్లినిక్ను రీఓపెన్ చేస్తానన్నాడు. అప్పటి నుంచి కోప్ఫెర్ ప్రాక్టీస్ మానేశారు. గత వారం కోప్ఫెర్ మరణించిన తర్వాత అతడి ఇంట్లో పిండాలను గుర్తించిన ఫ్యామిలీ మెంబర్లు షెరీఫ్ ఆఫీసుకు సమాచారం అందించారు. పిండాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని ఇంట్లో ఎలాంటి మెడికల్ ప్రొసీజర్ నిర్వహించిన ఆధారాలు లేవని చెప్పారు.