డాక్టర్​ ఇంట్లో 2 వేల పిండాలు

డాక్టర్​ ఇంట్లో 2 వేల పిండాలు

ఇల్ నాయీస్:  అమెరికాలోని ఓ అబార్షన్ డాక్టర్​ ఇంట్లో రెండు వేలకు పైగా మెడికల్ పరంగా భద్రపరిచిన పిండాలను గుర్తించడం కలకలం రేపింది. ఆ డాక్టర్​ వారం క్రితం చనిపోగా.. ఇప్పుడు వీటిని గుర్తించారు. ఈ విషయాన్ని విల్​ కౌంటీ షెరిఫ్ ఆఫీస్​ ధ్రువీకరించింది. ఆ డాక్టర్​ ఇంట్లో 2,246   పిండాలను గుర్తించినట్టు వెల్లడించింది. డాక్టర్​ ఉల్​రిచ్​ క్లోప్​ఫెర్​ ఈ నెల 3న చనిపోయాడు. ఇండియానాలోని సౌత్​బెండ్​లో ఒక అబార్షన్​ క్లీనిక్​లో ఆయన సుదీర్ఘ కాలంగా డాక్టర్​గా పనిచేశాడు. పేషెంట్ల రిజిస్టర్​ను సరిగ్గా మెయింటైన్​ చేయకపోవడం.. మెడికల్​ అబార్షన్​ పాలసీలను ఉల్లఘించడం వంటి వాటికి సంబంధించి ఈ క్లీనిక్​పై ఇండియానా స్టేట్​ డిపార్ట్​మెంట్​ఆఫ్ హెల్త్​కు అనేక కంప్లయింట్లు అందాయి.

అబార్షన్​కు ముందు 18 గంటల పాటు పేషెంట్లకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన కౌన్సిలింగ్​ను ఇవ్వడం లేదని మెడికల్​ ఏజెన్సీలు గుర్తించాయి. దీంతో 2015లో ఈ హాస్పిటల్​ లైసెన్స్​ను అధికారులు రద్దు చేశారు. ఇండియానాలో అతి ఎక్కువ అబార్షన్లు చేసిన డాక్టర్​గా క్లోప్ ఫెర్​ కు పేరుంది. నాలుగు దశాబ్దాలుగా చాలా క్లీనిక్స్​లో అతడు వేలాది ఆపరేషన్లు చేశాడు. అబార్షన్ల సమయంలో పేషెంట్లకు సేవలందించేందుకు క్వాలిఫైడ్​ స్టాఫ్​ లేకపోవడం ఇంకా పలు కారణాలను గుర్తించి ఇండియానా మెడికల్​ లైసెన్సింగ్​ బోర్డ్ ప్యానెల్​2016 నవంబర్​లో కోప్​ఫెర్​ లైసెన్సును రద్దు చేసింది.

43 ఏండ్ల తన కెరీర్​లో అబార్షన్లు చేసే సమయంలో తాను ఒక్క పేషెంట్​ను కూడా కోల్పోలేదని ప్యానెల్​కు అతడు చెప్పాడు. త్వరలోనే తన క్లినిక్​ను రీఓపెన్​ చేస్తానన్నాడు. అప్పటి నుంచి కోప్​ఫెర్​ ప్రాక్టీస్​ మానేశారు. గత వారం కోప్​ఫెర్​ మరణించిన తర్వాత అతడి ఇంట్లో పిండాలను గుర్తించిన ఫ్యామిలీ మెంబర్లు షెరీఫ్ ఆఫీసుకు సమాచారం అందించారు.  పిండాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని ఇంట్లో ఎలాంటి మెడికల్​ ప్రొసీజర్​ నిర్వహించిన ఆధారాలు లేవని చెప్పారు.