దీపావళి వేళ హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఇప్పటి వరకు 24 క్రాకర్ బర్న్ కేసులు నమోదయ్యాయి. వారిలో 12 మంది కంటికి తీవ్రమైన గాయాలవగా సరోజినీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నట్లు డా.వసంత తెలిపారు. మిగతా 12 మందికి ప్రాథమిక చికిత్స అందించి పంపామని తెలిపారు. బాణసంచా పేలుళ్ల వల్ల సున్నితమైన కంటి భాగంలో గాయాలైన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారని చెప్పారు.