రూ.100తో ఆర్టీసీ బస్సులో రోజంతా ప్రయాణం

రూ.100తో ఆర్టీసీ బస్సులో రోజంతా ప్రయాణం

ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఆందోళన చెందొద్దని.. రూ. 100 చెల్లించి 24 గంటల పాటు హైదరాబాద్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చని ప్రకటించారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. టీ24 పేరిట  24 గంటలు చెల్లుబాటయ్యే టికెట్ ను తీసుకొచ్చామన్నారు. టీ 24 టికెట్లు బస్ కండక్టర్ వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. ఈ టికెట్ తో ఆర్డినరీ,సబ్ఆర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్ , డీలక్స్ బస్సుల్లో కూడా ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చన్నారు. అలాగే డ్రైవర్లు డ్యూటీలో ఉండగా పాన్ మసాలా,గుట్కా తినకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.