24 యూనివర్సిటీలు ఫేక్: యూజీసీ

24 యూనివర్సిటీలు ఫేక్: యూజీసీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో 24 వర్సిటీలు ఫేక్​ అని, వాటికి గుర్తింపు ఇవ్వలేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) బుధవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్​లోని క్రైస్ట్​ న్యూ టెస్ట్​మెంట్​ డీమ్డ్​ యూనివర్సిటీకి కూడా గుర్తింపులేదని తెలిపింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి గుర్తింపు లేకుండా రన్​ చేస్తున్న ఈ వర్సిటీల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ స్టూడెంట్లు, పేరెంట్స్​ను కోరింది. వీటిలో ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్​లోనే ఉన్నాయని, దాని తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉందని యూజీసీ సెక్రటరీ రజనీష్​ జైన్​ చెప్పారు. కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిలలో ఒక్కో ఫేక్​ యూనివర్సిటీ ఉందని తెలిపారు.