సింగరేణి గనిలో అంబులెన్స్ సౌకర్యం

సింగరేణి గనిలో అంబులెన్స్ సౌకర్యం

గోదావరిఖని, వెలుగు: బొగ్గు గనులపై తరచూ ప్రమాదాలు జరగడం, కార్మికులు గుండెపోటుకు గురికావడం వంటి కారణాలతో మేనేజ్​మెంట్​ గనులపై 24 గంటల పాటు అంబులెన్స్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముందుగా ఆర్జీ 1 ఏరియా పరిధిలోని జీడీకే 11వ గనిపై అంబులెన్స్​ వాహనాన్ని సిద్ధం చేసింది.

గాయపడ్డ కార్మికులు, గుండెపోటుకు గురైన, అస్వస్థతకు గురైనవారు జీపులు, కార్లు, ఇతర వాహనాల్లో మెయిన్​ హాస్పిటల్​కు వచ్చేవరకు వారికి ప్రాథమిక వైద్యం అందాలనే ఉద్దేశంతో గనిపై 24 గంటల పాటు అంబులెన్స్​ ఏర్పాటు చేశామని ఏరియా జీఎం డి.లలిత్​ కుమార్​ తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని గనులపై అంబులెన్స్​ వెహికిల్స్​ను అందుబాటులో ఉంచేలా ప్లాన్​ చేస్తామని చెప్పారు.