
గోదావరిఖని, వెలుగు: బొగ్గు గనులపై తరచూ ప్రమాదాలు జరగడం, కార్మికులు గుండెపోటుకు గురికావడం వంటి కారణాలతో మేనేజ్మెంట్ గనులపై 24 గంటల పాటు అంబులెన్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముందుగా ఆర్జీ 1 ఏరియా పరిధిలోని జీడీకే 11వ గనిపై అంబులెన్స్ వాహనాన్ని సిద్ధం చేసింది.
గాయపడ్డ కార్మికులు, గుండెపోటుకు గురైన, అస్వస్థతకు గురైనవారు జీపులు, కార్లు, ఇతర వాహనాల్లో మెయిన్ హాస్పిటల్కు వచ్చేవరకు వారికి ప్రాథమిక వైద్యం అందాలనే ఉద్దేశంతో గనిపై 24 గంటల పాటు అంబులెన్స్ ఏర్పాటు చేశామని ఏరియా జీఎం డి.లలిత్ కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని గనులపై అంబులెన్స్ వెహికిల్స్ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తామని చెప్పారు.