ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్

ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్

మేడ్చల్ జిల్లా దుండిగల్​లోని ఎయిర్​‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా జరిగింది. అకాడమీలో 254 మంది ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్నారు. 

పరేడ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ రివ్యూయింగ్ ఆఫీసర్‌‌గా వ్యవహరించారు. ఆకాశ్ గంగా బృందం, ఎయిర్ వారియర్ డ్రిల్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్, పిలాటస్‌, హాక్‌, కిరణ్‌, చేతక్‌వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.     -వెలుగు, హైదరాబాద్ సిటీ