- యూపీ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
- చెరువులో ట్రాక్టర్ పడి 26 మంది మృతి, 10 మందికి గాయాలు
ఉత్తర ప్రదేశ్ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 26 మంది చనిపోయారు. మరో 10 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితులంతా ఫతేపూర్ లోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.
ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనాస్థలానికి వెళ్లాలని సంబంధిత అధికారులను యూపీ సీఎం యోగి ఆదేశించారు.