24 గంటల్లో 27 వేల కేసులు

24 గంటల్లో 27 వేల కేసులు

దేశంలో మరోసారి 30 వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 27 వేల 71 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 98 లక్షల 84 వేల100కి చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 336 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 43 వేల 355 కు  చేరింది. నిన్న మరో 30  వేల  695 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ 93 లక్ష88 వేల 159  మంది కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో  3 లక్షల 52 వేల 586 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 8లక్షల ,55వేల 157  టెస్టులు చేశారు. దీంతో డిసెంబర్ 13 వరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య  మొత్తం 15 కోట్ల45 లక్షల 66 వేల 990 కి చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది..