రాజన్న గోశాలలో ఆగని కోడెల మృత్యుఘోష

రాజన్న గోశాలలో ఆగని కోడెల మృత్యుఘోష
  • గురువారం మరో రెండు కోడెలు మృతి

వేములవాడ, వెలుగు : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. అనారోగ్యానికి గురైన మరో రెండు కోడెలు గురువారం మృత్యువాతపడ్డాయి. గోశాలలో ఇప్పటివరకు 28 కోడెలు చనిపోయినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. గోశాలలో మొత్తం 1300 కోడెలు ఉండగా.. ప్రస్తుతం 12 అనారోగ్యంతో బాధపడుతున్నాయి. వీటికి వెటర్నరీ డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారని, కొన్ని కోడెలు యాక్టివ్‌గా తిరుగుతున్నాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

గోశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

వేములవాడ రాజన్న గోశాలను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోడెలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. కోడెలకు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు.