టీఆర్ఎస్ ప్లీనరీలో అదిరిపోయే 29 రకాల వంటకాలు..

టీఆర్ఎస్ ప్లీనరీలో  అదిరిపోయే 29 రకాల వంటకాలు..

ప్లీనరీకి వచ్చే వారికి భోజన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 29 రకాల వంటలు సిద్ధం చేస్తున్నారు. ఒకే సారి 8 వేల మంది భోజనం చేసేలా 3 డైనింగ్ హాల్స్ సిద్ధం చేశారు. VVIPలు, ప్రజాప్రతినిధులు, మహిళల కోసం ప్రత్యేకంగా డైనింగ్ హాల్స్ రెడీ చేశారు. తెలంగాణ ప్రత్యేకమైన నాన్ వెజ్, వెజ్ వంటకాలు వడ్డించనున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫుడ్ కమిటీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, పాయా సూప్, బోటి ఫ్రై, ఎగ్ మసాలా, రుమాలీ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్ రైస్, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబార్, ఉలవచారు, క్రీమ్, పెరుగు, వంకాయ చట్నీ, జిలేబీ, డబల్ కా మీఠా, ఐస్ క్రీ లాంటి వంటకాలను వడ్డించనున్నారు. ఇందుకోసం 500 మంది వంటవాళ్లను, సహాయకులను నియమించారు.