కేంద్ర ఆరోగ్యశాఖలో ముగ్గురికి కరోనా

కేంద్ర ఆరోగ్యశాఖలో ముగ్గురికి కరోనా

ఢిల్లీ : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు ఆరోగ్యశాఖ అధికారులు. దీంతో అప్రమత్తమైన అధికారులు శనివారం, ఆదివారం  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు చెప్పారు. శానిటైజేషన్ పూర్తయిన తర్వాత తెరుస్తామని.. 2 రోజులపాటు అధికారులకు, సందర్శకులకు అనుమతి లేదని ప్రకటన విడుదల చేశారు ఆరోగ్యశాఖ అధికారులు. ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉద్యోగులు పాటించాల్సిన 40 నిబంధనల్ని విడుదల చేసినట్లు తెలిపారు.

మాస్కులు తప్పనిసరి, కంటైనమెంట్ జోన్ల నుంచి వచ్చే డ్రైవర్లు అనుమతి నిరాకరణ, సామాజిక దూరం పాటించడం, ఏసీల వాడకం నిలుపుదల, ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట ఉండటం పై నిషేధం, నేరుగా ఫైల్స్ తీసుకోవడం నిషేధం, ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించే సమావేశాలకు మినహాయింపులు లాంటి రూల్స్ ను పాటించాలని తెలిపారు అధికారులు.