ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రిష్ణగిరి జిల్లా సులగిరి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొని ప్రయాణికులపై దూసుకెల్లింది లారీ. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నారు. హోసూర్ నుండి క్రిష్ణగిరి వెలుతుండగా టైర్ పంక్చర్ కావడంతో బస్సులో నుండి ప్రయాణికులను దించి మరో బస్సులో ఎక్కిస్తుండగా వెనక వైపు నుండి వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టి ప్రయాణికులపై దూసుకెళ్లింది.గాయాలయిన వారిని హోసూర్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.