బోరుబావి లో పడిన మూడేళ్ళ బాలుడు

బోరుబావి లో పడిన మూడేళ్ళ బాలుడు

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామంలో మూడేళ్ల బాలుడు సాయి సంజయ్..   పొలంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటానా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. 120 అడుగుల లోతున్న బోరుబావిలో ప్రస్తుతం 20 అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తమ బాబు పరిస్థితిని తలచుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 120 అడుగుల వరకు బావి తవ్విన యజమాని నీరు పడకపోవడంతో దాన్ని పూడ్చకుండా అలాగే వదిలేసినట్టు చెబుతున్నారు.