30 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు..ఎక్కడో తెలుసా..?

30 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు..ఎక్కడో తెలుసా..?

రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారి పై పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా  గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఆరు బస్సుల్లో 30 కిలోల మేర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సి ఏరియాల నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తు్న్నట్టు అధికారులు గుర్తించారు. ఆర్టీసీ బస్సుల్లో గంజాయి రవాణా జరుగుతున్నట్టు పక్కా సమాచారం రావడంతో పోలీసులు ఈ తనిఖీ చేపట్టినట్టు తెలుస్తుంది.