కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (ఎచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30% పీఆర్సీని అమలు చేయనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 4 వేల మంది వాటర్ బోర్డ్ ఉద్యోగులకు ప్రయోజ నం కలగనుంది. తమ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు మెట్రో వాటర్ వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, యూనియన్ నేతలు సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.