ఫుడ్​పాయిజనింగ్​తో 30 మంది స్టూడెంట్స్​ కు అస్వస్థత

ఫుడ్​పాయిజనింగ్​తో 30 మంది స్టూడెంట్స్​ కు అస్వస్థత

30 మంది హాస్పిటల్​లో చేరిక  

ఎల్లారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ట్రైబల్​ హాస్టల్​లో ఫుడ్​పాయిజనింగ్​తో 30 మంది స్టూడెంట్స్​ అస్వస్థతకు గురయ్యారు. గర్ల్స్​ ట్రైబల్ స్కూల్ లో 6 నుంచి ఇంటర్ వరకు దాదాపు 500 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. శుక్రవారం రాత్రి హాస్టల్​లో అన్నం, బెండకాయ కూర పెట్టారు. భోజనం చేసిన తర్వాత దాదాపు 30 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే వారిని ఎల్లారెడ్డి గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు.

శనివారం డాక్టర్​వెంకటస్వామి స్కూల్​లో స్టూడెంట్లకు పరీక్షలు నిర్వహించారు. మరో 20 మంది అస్వస్థతకు గురైనట్లు తేలింది. రాత్రి సమయంలో వండిన భోజనం, నీటి వల్ల ఇలా జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆర్​డబ్ల్యూఎస్ సిబ్బంది నీటి శాంపిల్స్​సేకరించారు.