మెడికల్​ వ్యాపారి ఇంట్లో 30 తులాల గోల్డ్​ చోరీ

మెడికల్​ వ్యాపారి ఇంట్లో 30 తులాల గోల్డ్​ చోరీ

ఇచ్చోడ, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ మెడికల్​వ్యాపారి ఇంట్లో దొంగలు పడి 30 తులాల గోల్డ్​ఎత్తుకెళ్లారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక విఠలేశ్వర మందిరం కాలనీలో ఉండే వెలిశాల గణేశ్ మెడికల్​వ్యాపారి. ఇతనికి టౌన్​లో పెద్ద మెడికల్​షాపు కూడా ఉంది. బుధవారం ఉదయం కొడుకు, కోడలు బిజినెస్​పనిమీద హైదరాబాద్ వెళ్లగా, సాయంత్రం 4 గంటలకు గణేశ్ ఓ ఫంక్షన్ కు వెళ్లాడు. 

ఆ టైంలో వ్యాపారి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. బీరువా తాళాలు పగులగొట్టి 30 తులాల బంగారం, రూ.30 వేలు దోచుకెళ్లారు. ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వచ్చిన గణేశ్ చోరీ విషయాన్ని గుర్తించి లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.