దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 31 వేల 118 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 94 లక్షల 62వేల 810 కి చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 482 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 37 వేల 621కు చేరింది. నిన్న మరో 41 వేయి 985 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ 88 లక్షల 89 వేల 585 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4 లక్షల 35వేల 603యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 9,లక్షల69వేల 322 టెస్టులు చేశారు.
With 31,118 new #COVID19 infections, India's total cases rise to 94,62,810
With 482 new deaths, toll mounts to 1,37,621. Total active cases at 4,35,603
Total discharged cases at 88,89,585 with 41,985 new discharges in last 24 hrs pic.twitter.com/MaBuXqAmps
— ANI (@ANI) December 1, 2020