ఒక్కరోజే 31,118 కేసులు.. 41,985 రికవరీ

ఒక్కరోజే 31,118 కేసులు.. 41,985 రికవరీ

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 31 వేల 118 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 94 లక్షల 62వేల 810 కి చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 482 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 37 వేల 621కు చేరింది. నిన్న మరో 41 వేయి 985 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ 88 లక్షల 89 వేల 585  మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 35వేల 603యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 9,లక్షల69వేల 322 టెస్టులు చేశారు.