ఒడిశా నుంచి సిటీకి గంజాయి

ఒడిశా నుంచి సిటీకి గంజాయి

హైదరాబాద్, వెలుగు: ఓల్డ్‌‌ సిటీలో గంజాయి ముఠా గుట్టురట్టైంది. ఒడిశా నుంచి గంజాయి సప్లయ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సౌత్ ఈస్ట్ టాస్క్​ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రూ.3 లక్షల విలువైన 31.34 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను టాస్క్‌‌ఫోర్స్‌‌ అడిషనల్ డీసీపీ మనోహర్‌‌‌‌ మంగళవారం వెల్లడించారు. 

మైలార్​దేవ్‌‌పల్లికి చెందిన షేక్​అబ్దుల్​ఫైజల్, మహ్మద్​ సమీఉద్దీన్, మహ్మద్ అమీర్, హుస్నా ఫాతిమా.. ఈ నలుగురు గ్యాంగ్ గా ఏర్పడి వైజాగ్ లోని అరకు, ఒడిశాలోని ఏజెన్సీల నుంచి గంజాయి కొని సిటీకి తీసుకొచ్చారు. న్యూఇయర్​ సందర్భంగా సిటీలో అమ్మేందుకు యత్నించారు. వీరిపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కంచన్‌‌బాగ్‌‌ క్రాస్‌‌ రోడ్స్‌‌లో నలుగురిని అరెస్టు చేశారు. ఒడిశా నుంచి వీరికి గంజాయి సప్లయ్ చేసిన నిందితుడు రితేష్​ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.