దేశంలో తగ్గుతున్నకరోనా కేసులు, మరణాలు

దేశంలో తగ్గుతున్నకరోనా కేసులు, మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా లక్షా 65 వేల 553 కేసులు నమోదయ్యాయి. 3 వేల 460 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని 2 లక్షల 76 వేల 309 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 78 లక్షల 94 వేల 800కు చేరిందని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 21 లక్షల 14 వేల 508 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. కరోనాతో ఇప్పటి వరకు 3 లక్షల 25 వేల 972 చనిపోయారన్నారు అధికారులు. దేశవ్యాప్తంగా రికవరీ రేట్ 91.25 శాతం, డెత్ రేట్ 1.17 శాతం ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 21 కోట్ల 20 లక్షల 66 వేల 614 మందికి టీకాలు వేశామని తెలిపారు.