ముంబై తీరంలో పడవ ప్రమాదం.. 38 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోట్ బోల్తా

ముంబై తీరంలో పడవ ప్రమాదం.. 38 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోట్ బోల్తా

ముంబై తీరంలో  పడవ ప్రమాదం జరిగింది. గేట్ వే ఇండియా సమీపంలో అరేబియా సముద్రంలో ఇంజిన్ లో తలెత్తిన లోపంతో టూరిస్టు బోటు మునిగిపోయింది. నిన్న (సెప్టెంబర్ 3)రాత్రి తీరానికి ఒకటిన్నర నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో సిబ్బందితో సహా 38 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలోని  టూరిస్టు పడవల సాయం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రయాణికులతో పాటు, సిబ్బందిని అజాద్ హింద్ అనే  టూరిస్టు పడవ సాయంతో ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.