అమ్మాయిలను వేధించిన 39 మంది అరెస్ట్.. 10 మందికి మూడ్రోజుల జైలు శిక్ష

అమ్మాయిలను వేధించిన 39 మంది అరెస్ట్.. 10 మందికి మూడ్రోజుల జైలు శిక్ష

హైదరాబాద్‌, వెలుగు: అమ్మాయిలను వేధిస్తున్న ఆవారాలపై సిటీ షీ టీమ్స్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నాంపల్లి నుమాయిష్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌, పీపుల్స్ ప్లాజాలో జరిగిన కైట్‌ ఫెస్టివల్‌, చార్మినార్, అఫ్జల్‌గంజ్‌ బస్టాప్స్​లో డెకాయ్ ఆపరేషన్స్ చేశారు. యువతులు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు 39 మంది పోకిరీలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీడియో రికార్డింగ్‌ ఆధారాలు అందించారు.

10 కేసుల్లో నిందితులుగా ఉన్న ఆవారాలకు నాంపల్లి కోర్టు 3 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. మూడు కేసుల్లో నిందితులను హెచ్చరించింది. మరో 26 కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని విమెన్‌ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత తెలిపారు. అమ్మాయిలను వేధించే ఆవారాల గురించి డైరెక్ట్​గా లేదా  వాట్సాప్‌ నంబర్‌‌ 9490616555, డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.