V6 News

చివరి వన్డే.. టీమిండియా టార్గెట్- 316

చివరి వన్డే.. టీమిండియా టార్గెట్- 316

కటక్ లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 315 పరుగులు చేసింది.  టీమిండియా మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో  వెస్టిండీస్ బ్యాటింగ్ చేపట్టింది. భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే  316  పరుగులు చేయాల్సి ఉంది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు  పూరన్ 89,  పోలార్డ్  74, హోప్ 42, ఛేజ్ 38, హెట్మెయిర్  37, లూయిస్ 21 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు నవదీప్ షైనీ 2, షమీ, శార్దూల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు.

3rd ODI: West Indies finish at 315/5 in 50 overs against India, in Cuttack.