రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ హుడా కాలనీలో విషాదం చోటుచేసుకొంది. ప్రమాద వశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల పాప మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ పరిధిలోని హుడా కాలనీలో నివసించే లక్ష్మీ శేఖర్ అనే దంపతులకు తేజశ్రీ, నిత్యశ్రీ (3) అనే ఇద్దరు కూతుళ్లు(కవలలు) ఉన్నారు. శుక్రవారం నాడు భార్యా భర్తలు ఇద్దరూ కూలీ పనికి వెళ్ళారు. సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న నిత్యశ్రీ ప్రమాద వశాత్తు నీటి సంపు లో పడి మృతి చెందింది. స్థానికులు గమనించి పాపను బయటకు తీసినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో మృతి చెందింది. సాయంత్రం పని ముగించుకొని ఇంటికి చేరిన పాప తల్లిదండ్రులు తమ బిడ్డ ఇక లేదని తెలిసి కన్నీరు మున్నీ రయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి
- క్రైమ్
- July 4, 2020
లేటెస్ట్
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- KKR vs DC: నరైన్ అరుదైన ఘనత.. మలింగ ఆల్టైం రికార్డ్ బ్రేక్
- Nag Ashwin: బహుశా.. ఇసుకని చూసి అలా అనుకున్నారేమో.. ఇచ్చిపడేసిన కల్కి డైరెక్టర్
- రిజర్వేషన్లపై విమర్శలు.. అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
- వందే భారత్ రైలులో.. రూ.50 లక్షలు పట్టివేత
- గూగుల్ భారీ ప్రక్షాళన.. పైథాన్ ఒక్కటే కాదు.. డార్ట్, ఫ్లట్టర్ కూడా క్లోజ్
- KKR vs DC: దిగ్గజాలు కలిసిన వేళ.. గంగూలీకి షారుఖ్ సర్ ప్రైజ్
- జూన్ 3 నుంచి పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు
- Varalakshmi Sarathkumar: ఆ సమయంలో తన భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- టెన్త్ క్లాస్ రిజల్ట్స్ : నిర్మల్ టాప్.. వికారాబాద్ లాస్ట్
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- T20 World Cup 2024: కోహ్లీ వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే.. సెలక్టర్లకు రోహిత్ డిమాండ్